సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన కొమ్ము రవి కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆకునూర్ గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎండీ. హైమద్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అంచలంచలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం దక్కడం సంతోషకరమన్నారు.