అంకితభావంతో విధులు నిర్వహించే అధికారిగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పి. సరోజ గుర్తింపు పొందారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. బుధవారం ఆమె పదవీ విరమణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే అధికారులు అరుదుగా ఉంటారన్నారు. పదవీ విరమణ ఉద్యోగ జీవితంలో సహజమన్నారు.