సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

84చూసినవారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకి బుధవారం తెలిపారు. హైదరాబాద్ నుండి ఆరోగ్యం-సీజనల్ వ్యాధులు- సంసిద్ధత, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితులు, స్వచ్ఛదనం - పచ్చదనం పురోగతిలపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.