ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అంకిత భావంతో సేవ చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా సలహాదారు సూర్యరాజ్ కోరారు. బుధవారం సిద్దిపేట లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా జోజి, ప్రధాన కార్యదర్శిగా వైవీ సురేశ్ కుమార్, కోశాధికారిగా నరసింహారెడ్డి, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జిల్లా వైస్ గవర్నర్లు అమర్నాథ్ రావు, విజయలక్ష్మి మాట్లాడారు.