సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ నుంచి మాదారం వెళ్లే రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడడంతో దేవుళ్ల పోచయ్య మృతి చెందాడు. దొంతికి చెందిన పోచయ్య వర్గల్ మండలంలో శుభకార్యం ఉండడంతో తన టీవీఎస్ ఎక్సెల్ బైక్ పై వెళ్తున్నారు. రోడ్డుపై మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు గౌరారం సార్ ఎస్సై కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు.