ఈ నెల 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవనంలో సమ్మె వాల్ పోస్టర్ ను కార్మికులతో కలిసి సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు, బడా వ్యాపారస్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చిందన్నారు.