సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలంలోని మగ్ధుంపూర్ గ్రామంలో గురువారం సీసీ రోడ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపన చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల కింద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి తదితరులు కలిసి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.