
మే 8న ఏపీ కేబినెట్ సమావేశం
AP: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మే 8న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర మంత్రివర్గం మొత్తం పాల్గొననుంది. ఈ నేపథ్యంలో కేబినెట్కు సంబంధించిన అంశాలపై మే 6వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు ప్రభుత్వశాఖలకు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు.