
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నికేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్.. ఇలా మూడు కేటగిరీలుగా మద్యం సరఫరాను విభజించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను 14.5 నుంచి 20 శాతం ప్రభుత్వం పెంచింది.