ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సాగు లక్ష్యం చేరుకునేలా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో ఆయిల్ఫైడ్, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. అనంతరం ఆయిల్పామ్ సాగు కరపత్రాన్ని ఆవిష్కరించారు.