మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు సిద్ధిపేట జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కాంతారావు గురువారం జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆరుగురికి మొత్తంగా రూ. 17, 000 జరిమానా విధించారని తెలిపారు.