సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో ఆటోడ్రైవర్లు స్టిక్కర్లను తమ ఆటోలకు వేసుకుంటున్నారు. వారం రోజులుగా కేసీఆర్ సార్ను క్షమించాలని కోరుకుంటూ చేర్యాల మండలం ఆకునూరు, పెదరాజుపేట, ముస్త్యాల, గుర్జకుంట, దొమ్మాట, అర్జునపట్ల కు చెందిన ఆటోడ్రైవర్లు తమ ఆటోల బయట, లోపల ఇలాంటి స్టిక్కర్లను వేసుకుంటున్నారు. ఆటోలపై వెలసిన ఆ స్టిక్కర్లను చూసి ప్రయాణికులు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే పాలన బాగుండే అని మాట్లాడుకుంటుండడం విశేషం.