
ఇండియా జస్టిస్ రిపోర్ట్లో తెలంగాణకు అగ్రస్థానం
‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ నివేదిక ప్రకారం.. దేశంలోనే సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీస్ విభాగం నిలిచింది. సమర్థవంతమైన న్యాయవ్యవస్థలలో రెండో స్థానం సాధించింది. పోలీస్ వ్యవస్థ సామర్థ్యం అంశంలో ఏపీ, కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. న్యాయవ్యవస్థలలో కర్ణాటక, AP, తెలంగాణ, తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 197.5 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా, 155 మంది మాత్రమే ఉన్నారు.