సిద్ధిపేట: వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం ఆగదు

76చూసినవారు
సిద్ధిపేట: వక్ఫ్ చట్టం రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు ముస్లింల పోరాటం ఆగదని సిద్దిపేట ముస్లిం జెఏసి సభ్యులు అబ్దుల్ సమి, ముఫ్తీ కరీముద్దీన్ పటేల్ తెలిపారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లింల ఆస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాల రాస్తుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్