సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, పరీక్షల నోడల్ అధికారి, అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరీక్షా సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల, మిట్టపల్లి బాలికల కళాశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పరీక్ష పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ ఏడీ సీపీ సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు.