సిగాచీ పేలుడు ఘటన.. 43కి చేరిన మృతుల సంఖ్య

17చూసినవారు
సిగాచీ పేలుడు ఘటన.. 43కి చేరిన మృతుల సంఖ్య
పాశమైలారం సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతుల సంఖ్య 43కి చేరింది. తాజాగా డీఎస్ఏ పరీక్షలో ఇద్దరి అవశేషాలు గుర్తించారు. కాగా గల్లంతైన మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది. పేలుడు ధాటికి శరీర భాగాలన్నీ యంత్రాలకు అతుక్కుపోయాయి. దీంతో యంత్రాల నుంచి అవశేషాలను సేకరించి పరీక్షిస్తున్నారు. కుప్పకూలిన భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్