జగిత్యాల విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధరూర్ క్యాంపులోని కోదండ రామాలయంలో అయోధ్యలో శ్రీ రామ మందిరానికి సమర్పించడానికి 13 కిలోల వెండి 1కిలో బంగారంతో తయారు చేసిన శ్రీరామ ధనుస్సుకు శనివారం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, సహా కార్యదర్శి గాజోజు సంతోష్, కోశాధికారి మామిదాల రాములు, నగర అధ్యక్షులు జిట్ట వేణి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.