కేంద్రమంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి గజేంద్ర షెకావతు కలిశానన్నారు. అవసరమైతే ఆయన్ను సైతం వేములవాడకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానన్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు.