యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారవద్దు- సి. ఐ

70చూసినవారు
శంకరపట్నం మండల కేంద్రంలో ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ హాజరై మాట్లాడుతూ. యువత మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు లోను కాకుండా దేశ భవిష్యత్తుకు బాసటగా నిలవాలని సూచించారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆర్థిక మోసాలు జరగకుండా విజ్ఞతతో మెలగాలని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్