సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. రెండవ రోజు ఆర్జీ 3, ఏపీఏ శిబిరాన్ని ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వైవిరావు, సెంట్రల్ సెక్రెటరీ జూపాక రామచందర్, బ్రాంచ్ సెక్రటరీ ఎంఆర్సి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కందికట్ల సమ్మయ్యలు పాల్గొన్నారు.