దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేరెందుకు నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 5న జరిగిన నీట్ పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని ప్రీతం డిమాండ్ చేశారు.