ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు మాత్రమే మొదట విడుదల ఇల్లు మంజూరు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం మన జిల్లాలో రెండు నియోజకవర్గాలకు కలిపి 7 వేల ఇల్లు మొదటి విడతలో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పైలట్ గ్రామాలలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు.