సిరిసిల్ల పట్టణం విద్యానగర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గుడ్ల కిషన్, ప్రధాన కార్యదర్శిగా రెడ్డి మల్ల కొండయ్య, ఉపాధ్యక్షుడిగా జితేందర్, కోశాధికారిగా హరికృష్ణ, ఉప కోశాధికారిగా మహేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వారు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.