ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాజీ ఎమ్మెల్సీ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.