తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నలుగురు నిందితుల విచారణకు కోర్టు విధించిన కస్టడీ గడువు ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో విచారణ అనంతరం నిందితులను రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తిరుపతి రెండవ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించలేదని, మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ కోరినట్లు తెలుస్తోంది.