శ్రీలంకలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ బ్రిగేట్ పాసింగ్ ఔట్ పరేడ్ ప్రదర్శన సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. కూలిపోయిన హెలికాప్టర్ రిజర్వాయర్లో పడిపోవడంతో అందులో ఉన్న 12 మందిలో ఆరుగురు మరణించారని సైనిక అధికారి తెలిపారు. మదురు ఓయ జాతీయ ఉద్యానవనం వద్దకు చేరుకోగానే బెల్ 212 హెలికాప్టర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది.