స్కిల్ యూనివర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తామని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి మాట్లాడారు. 'తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఏటా వేలాది మంది యువత ఇంజినీరింగ్ పట్టాలు అందుకుంటున్నారు కానీ యువతలో సరైన నైపుణ్యాలు ఉండటం లేదు. ప్రస్తుత కాలానికి తగినట్లు యువతలో నైపుణ్యాలు పెరగాల్సి ఉంది' అని అన్నారు.