టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన ICC తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి మొత్తంగా 264 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 727 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. తొలిస్థానంలో సాతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ కొనసాగుతోంది. ఇక భారత్ తరఫున టాప్-10లో మంధన ఒక్కరే ఉండడం విశేషం.