ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో తమ నేతల పుణ్యస్నానాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే విమర్శించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకమని పేర్కొంది. దీనికి బాధ్యతగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు.