ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు వీలైనంత సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును సోమవారం కలిసిన సోనూసూద్.. కూటమి ప్రభుత్వానికి అంబులెన్స్లు విరాళంగా ఇచ్చారు. సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్లను అందజేసినట్లు ఆయన వెల్లడించారు.