తెలంగాణలో రూ.12,600 కోట్లతో ‘సౌరగిరి’ పథకం

72చూసినవారు
తెలంగాణలో రూ.12,600 కోట్లతో ‘సౌరగిరి’ పథకం
తెలంగాణాలో వర్షాధారంపైనే ఆధారపడి అడవిలోనే పోడు భూములను సాగు చేసుకుంటూ విద్యుత్ ఇబ్బందులు పడుతున్న వారికీ రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. గిరిజనులకు సాగునీటితో పాటు విద్యుత్​ సౌకర్యం కల్పించాలని రూ.12,600 కోట్లతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఇందిరా సౌర గిరిజల వికాసం' పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ పథకాన్ని మే 18న నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించబోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్