దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ మాథ్యూ బ్రిట్ట్కే చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఆడిన తొలి మ్యాచ్లోనే 150 పరుగులు చేసి అరుదైన ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో ఈ యువ క్రికెటర్ 150 పరుగులు చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్లోనే 150 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు విండీస్ బ్యాటర్ డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది.