ఎమ్మెల్యే అనర్హత వేటు వ్యవహారంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ.. 'ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుంది. మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని BRS, BJPలే పదేపదే చెప్పాయి. కానీ, కేసీఆర్ లక్కీనంబరు మా దగ్గరున్నందున ప్రభుత్వానికేమీ ఢోకా లేదు' అని వ్యాఖ్యానించారు.