భారత్ – పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్కు ప్రత్యేక అధికారాలు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని చీఫ్కు కల్పించింది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునే సదుపాయాన్ని ఆర్మీ చీఫ్కు కల్పించింది.