ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ సాధించారు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో ట్రావిస్ హెడ్కు ఇది 7వ అర్థశతకం. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ స్కోర్ 154/0గా ఉంది. క్రీజులో అభిషేక్ శర్మ (88), హెడ్ (59) ఉన్నారు.