భారీ భద్రత మధ్య భక్తుల ఉత్సాహంతో హైదరాబాద్లో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర సాగుతోంది. సిటీలోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుండి విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర కోటి, నారాయణగూడ బైపాస్ మార్గంగా సాగి, చివరకు సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో ముగియనుంది. సుమారు 12km సాగనున్న యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.