జమ్మూకశ్మీర్లో వేడి గాలులు వీస్తున్నాయి. గత ఏడు దశాబ్దాలలో లేనంతగా గరిష్ట ఉష్ణోగ్రతలు శ్రీనగర్లో శనివారం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. శ్రీనగర్లో ఆల్-టైమ్ అత్యధిక ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్. ఇది జులై 10, 1946న నమోదు అయింది. పహల్గామ్, ఖాజిగుండ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.