తెలంగాణ అత్యాచారాలకు కేంద్రంగా మారుతుందని బీఆర్ఎస్ MLA సునీత లక్ష్మారెడ్డి అన్నారు. 'రేవంత్ ఆ రోజు ప్రచారంలో మీరు మాట్లాడిన మాటలు నాపై కూడా 3 కేసులు అయ్యాయి. సమాచార లోపంతో మాట్లాడడం మంచిది కాదు. జూనియర్ MLAలు మమ్మల్ని హేళనగా మాట్లాడారు. మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు.. బాధితులకు భరోసా ఎక్కడ? ఇటువంటివి ఎందుకు పునరావృతం అవుతున్నాయి? చర్యలు ఎక్కడ?' అని ప్రశ్నించారు. అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పారు.