బుధవారం మార్కెట్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, యూఎస్- చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి మార్కెట్ సెంటిమెంట్ను మెరుగుపరిచాయి. మధ్యాహ్నం 1:37 వరకు సెన్సెక్స్ 204 పాయింట్లు పెరిగి 82,596కి, నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 25,171కి చేరింది. నిపుణుల అంచనాల ప్రకారం, ట్రంప్ ప్రసంగం, భారత సీపీఐ గణాంకాలు వంటివి మార్కెట్ దిశను నిర్దేశించే అవకాశం ఉంది.