దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,508.91 పాయింట్లు లాభపడి 78,553.20 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్లు పెరిగి 23,851.65 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో జొమాటో (ఎటర్నల్), ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా షేర్లు లాభపడగా, విప్రో, టెక్ మహీంద్రా, JSW స్టీల్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.37 వద్ద ఉంది.