దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 626 పాయింట్లు లాభపడి 81,343 దగ్గర ముగియగా.. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 24,800 వద్ద స్టిరపడింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.83.65గా ఉంది. సెన్సెక్స్లో టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.