భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 880.34 పాయింట్లు నష్టపోయి 79,454.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 265.80 పాయింట్లు నష్టపోయి 24,008.00 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో ప్రధానంగా ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హీరో మోటోకార్ప్ లాభపడ్డాయి.