మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తొలుత నష్టాల్లోకి జారిన మార్కెట్లు మధ్యాహ్నానికి కొంత పుంజుకుంది. సెన్సెక్స్ 333 పాయింట్లు తగ్గి 82,077, నిఫ్టీ 92 పాయింట్లు తగ్గి 25,019 వద్ద ట్రేడవుతోంది. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ లాభపడగా.. HCL, TCS నష్టాల్లో ఉన్నాయి. డిఫెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగగా, నిఫ్టీ డిఫెన్స్ సూచీ 1.3% పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర $78 దాటింది.