దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమైనా, అనంతరం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఉదయం 9:28కి సెన్సెక్స్ 56 పాయింట్లు పెరిగి 82,509 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 25,125 వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రూపాయి మారకం విలువ 85.61గా ఉంది.