దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 10.52 పాయింట్లు లేదా 0.013% కోల్పోయి 79,914.26 వద్ద సెషన్ను ముగించింది. అదే సమయంలో నిఫ్టీ 12.70 పాయింట్లు లేదా 0.052% లాభపడి 24,337.15 వద్ద నిలిచింది. ONGC, BPCL, కోల్ ఇండియా, ITC, టాటా మోటర్స్ షేర్లు రాణించాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా&మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, NTPC నష్టాలను చవిచూశాయి.