ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మేళా జరగనుంది. ఈ అపురూప ఘట్టంలో భాగమయ్యేందుకు అంబాసిడర్ బాబా, రుద్రాక్ష బాబా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11వేల రుద్రాక్షలు ఉన్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు.