భోపాల్లోని ఐష్బాగ్ సమీపంలో నిర్మించిన రైల్వే ఓవర్బ్రిడ్జ్ అధికారికంగా ప్రారంభించకముందే చర్చనీయాంశంగా మారింది. ఇది విచిత్రంగా 90డిగ్రీల మలుపు ఉండటమే కారణం. వంతెన నిర్మాణానికి భూమి కొరత ఎదురుకావడం, సమీపంలోనే మెట్రో స్టేషన్ ఉండటంతో ఈ విధంగా నిర్మించక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా 3లక్షల మంది ప్రయోజనం పొందుతారని తెలిపారు. కానీ ఈ మలుపు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.