ఫీజు కట్టలేదని ఎగ్జామ్కు అనుమతించకపోవడంతో కాలేజీ గేటు ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది విద్యార్థిని. యూపీలోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. ఆరోహి కాన్పూర్లోని సాయి నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదువుతుంది. ఈ క్రమంలో అదనపు ఫీజు చెల్లించకపోవడంతో ఆమె పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆమె కాలేజీ గేటు ముందే సూసైడ్కు యత్నించగా పోలీసులు అడ్డుకొని సర్ధిచెప్పారు. తర్వాత యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.