TG: బీటెక్ ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని సంజనారెడ్డి మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపంతో ఉన్నట్టు తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంజన పేరెంట్స్ హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో జగిత్యాల పట్టణంలోని ఇంట్లో అర్ధరాత్రి ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.