భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి ప్రయాణం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితుల వల్ల మంగళవారం జరగాల్సిన స్పేస్ఎక్స్ డ్రాగన్ ప్రయోగాన్ని బుధవారానికి మార్చారు. జూన్ 11 సాయంత్రం 5:30కి ప్రయోగం జరగనుంది. శుభాంశు మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లే తొలి భారత పౌరుడిగా శుభాంశు గుర్తింపు పొందనున్నారు. ఇది ఐఎస్ఎస్కు ఆయన మొదటి ప్రయాణం.